ఇస్లామాబాద్: ఫాస్ట్ బౌలర్ హరిస్ రౌఫ్ పాకిస్థాన్ జట్టులో ఇప్పుడో కీ ప్లేయర్. 29 ఏళ్ల ఆ క్రికెటర్ ఓ టాప్ సీక్రెట్ చెప్పాడు. ఇటీవల సక్సెస్ఫుల్ బౌలర్గా ఎదిగిన అతను.. తాజాగా పాక్ టీవీ ఛానల్కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. అయితే అకాడమీ శిక్షణ సమయంలో తాను రోజుకు 24 కోడి గుడ్లు తినేవాడినని రౌఫ్ తెలిపాడు. 2020లో పాక్లో రౌఫ్ అరంగేట్రం చేశాడు. అతను 16 వన్డేల్లో 29 వికెట్లు తీశాడు. ఇక టీ20ల్లోనూ దుమ్మురేపుతున్నాడు. 57 మ్యాచ్లు ఆడిన అతను 72 వికెట్లు తీసుకున్నాడు.
బరువు పెంచుకునేందకు హరిస్ రౌఫ్ గుడ్లు బాగా తిన్నట్లు చెప్పాడు. రోజుకు 24 గుడ్లు తింటానని, మాజీ బౌలర్, కోచ్ అకీబ్ జావెద్ ఇచ్చిన డైట్ ప్లాన్ పాటిస్తున్నానని, 8 గుడ్లు బ్రేక్ఫాస్ట్కు, 8 లంచ్కు, 8 డిన్నర్కు తింటానన్నాడు. క్రికెట్ అకాడమీకి వె ళ్లినప్పుడు అక్కడ కుప్పల్లో గుడ్లు ఉండేవని, ఆ అకాడమీ ఓ పౌల్ట్రీ ఫామ్లో ఉండేదని రౌఫ్ తెలిపాడు. అకాడమీ వెళ్లినప్పుడు తన బరువు 72 కిలోలే ఉన్నానని, అయితే 83 కేజీలకు బరువు పెరగాలని అకీబ్ చెప్పాడని, నా హైట్కు అదే కరెక్ట్ వెయిట్ అని, ఇప్పుడు 82 కిలోల బరువు ఉన్నట్లు రౌఫ్ చెప్పాడు.
నెట్ బౌలర్ స్థాయి నుంచి పాక్ జాతీయ జట్టుకు ఎంపిక కావడం పట్ల తనను ఇండియన్ కోచ్ రవిశాస్త్రి కూడా ఎంతో ప్రశంసించినట్లు రౌఫ్ తెలిపాడు. విరాట్ కూడా తన బౌలింగ్ ట్యాలెంట్ను మెచ్చుకున్నట్లు చెప్పాడు.