Ganguly-Kohli Row: టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీని సారథ్య బాధ్యతల నుంచి తాను తొలగించలేదని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ మరోసారి స్పష్టం చేశాడు. రెండేండ్ల క్రితం భారత్.. 2021 టీ20 వరల్డ్ కప్ ముగిసిన తర్వాత కోహ్లీ పొట్టి ఫార్మాట్ నుంచి తప్పుకోగా వన్డే ఫార్మాట్ నుంచి కూడా తప్పిస్తూ బీసీసీఐ తీసుకున్న నిర్ణయం పెను సంచలనాలకు దారితీసింది. ఆ సమయంలో బీసీసీఐ వర్సెస్ కోహ్లీగా వార్తలు వచ్చాయి. తదనంతరం జరిగిన పరిణామాలు కూడా అగ్గికి ఆజ్యం పోశాయి. తాజాగా దీనిపై రెండేండ్ల తర్వాత దాదా స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
దాదాగిరి అన్లిమిటెడ్ సీజన్ 10లో భాగంగా గంగూలీ మాట్లాడుతూ.. ‘విరాట్ కోహ్లీ కెప్టెన్సీని నేను తొలగించలేదు. అదీగాక సారథిగా కొనసాగాలని నేను దాదాతో చాలాసార్లు చెప్పాను. కానీ కోహ్లీ మాత్రం టీ20లలో సారథిగా కొనసాగడానికి అంతగా ఆసక్తి చూపలేదు. అతడు తన నిర్ణయం ప్రకటించిన తర్వాత.. టీ20ల నుంచి తప్పుకుంటే మొత్తం వైట్ బాల్ కెప్టెన్సీ నుంచి కూడా దిగిపోవడం ఉత్తమమని కోహ్లీకి సూచించాను. అప్పుడు వైట్ బాల్, రెడ్ బాల్ కెప్టెన్ విధానాన్ని ఫాలో అవుదామని సూచించాను..’ అని తెలిపాడు.
2021 నవంబర్లో టీ20 వరల్డ్ కప్కు ముందే కోహ్లీ పొట్టి ఫార్మాట్ నుంచి దిగిపోగా అతడు భారత్కు తిరిగొచ్చాక డిసెంబర్లో టీమిండియా దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లబోయే ముందు వన్డే సారథ్య బాధ్యతల నుంచి కూడా తప్పించింది. ఇక 2022 సఫారీ టూర్లో టెస్టు సిరీస్ ఓడిపోయాక కోహ్లీ టెస్టు కెప్టెన్సీ నుంచి కూడా తప్పుకున్నాడు.