హైదరాబాద్, ఆట ప్రతినిధి: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫుట్బాల్ టోర్నీలో హైదరాబాద్ జోరు కొనసాగుతోంది. వరుసగా నాలుగో మ్యాచ్లో నెగ్గిన హైదరాబాద్ 13 పాయింట్లతో పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. శనివారం జరిగిన పోరులో హైదరాబాద్ 1-0తో ఒడిశాపై గెలుపొందింది. మ్యాచ్ ఆరంభమైన ఎనిమిదో నిమిషంలో మన జట్టు తరఫున మహమ్మద్ యాసిర్ ఏకైక గోల్ సాధించాడు. మరో మ్యాచ్లో కేరళ బ్లాస్టర్స్ 3-0తో నార్త్ ఈస్ట్ యునైటెడ్ క్లబ్పై గెలిచింది.