న్యూఢిల్లీ: బాకు వేదికగా వచ్చే నెల 8 నుంచి 15వ తేదీ వరకు జరిగే షూటింగ్ ప్రపంచకప్ కోసం ఎంపిక చేసిన భారత జట్టులో హైదరాబాదీ యువ షూటర్ ఇషాసింగ్ చోటు దక్కించుకుంది. ఈ ఏడాది జరుగుతున్న ఐదవ ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచకప్ కోసం జాతీయ రైఫిల్ సమాఖ్య(ఎన్ఆర్ఏఐ) శుక్రవారం 22 మందితో కూడిన జట్టును ప్రకటించింది.
మహిళల 10మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో మను భాకర్ స్థానంలో ఇషాసింగ్ బరిలోకి దిగనుంది. దీనికి తోడు 25మీటర్ల పిస్టల్ ఈవెంట్లోనూ హైదరాబాదీ తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. మరోవైపు ఇటీవల భోపాల్లో జరిగిన వరల్డ్కప్ టోర్నీలో ఆకట్టుకున్న షాశు తుషార్మానె, శివ నార్వల్ మెగాటోర్నీలో చోటు దక్కించుకున్నారు. బాకులో జరిగే షూటింగ్ ప్రపంచకప్ కోసం భారత షూటర్లు భూపాల్లో సెలెక్షన్ ట్రయల్స్లో పాల్గొననున్నారు.