బెంగళూరు: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో హైదరాబాదీ పేసర్ అరుంధతి రెడ్డిపై జరిమానా పడింది. లీగ్ రెండో సీజన్లో భాగంగా.. సోమవారం యూపీ వారియర్స్తో జరిగిన మ్యాచ్లో నిబంధనలు అతిక్రమించినందుకు గానూ నిర్వాహకులు ఈ ఢిల్లీ పేసర్ మ్యాచ్ ఫీజులో 10 శాతం కోత విధించారు.
ప్రత్యర్థి బ్యాటర్ను ఔట్ చేసిన అనంతరం అరుంధతి పరుష పదజాలం వినియోగించడంతో ఈ శిక్ష పడింది.