హైదరాబాద్, ఏప్రిల్ 9 (నమస్తే తెలంగాణ): ప్రతిష్ఠాత్మక ఆసియా గేమ్స్కు హైదరాబాదీ అథ్లెట్ అమ్లాన్ బొర్గోహై ఎంపికయ్యాడు. కేరళలో జరిగిన 25వ ఫెడరేషన్కప్లో 200మీటర్ల రేసును అమ్లాన్ 20.52 సెకన్లలోముగించి జాతీయ రికార్డు నెలకొల్పాడు. ఈ క్రమంలో ఆసియా క్రీడలకు అర్హత సాధించిన అమ్లాన్తో పాటు కోచ్ సాయిరెడ్డిని శనివారం సరూర్నగర్ స్టేడియంలో సన్మానించారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా క్రీడల అధికారి వెంకటేశ్వర్రావు, డీఎస్పీ భాస్కర్, మల్లికార్జున్, మల్లేశ్, జితేందర్రెడ్డి, డాక్టర్ హరిప్రకాశ్, రాజశేఖర్, ప్రశాంత్, నరేశ్ తదితరులు పాల్గొన్నారు.