గోవా: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫుట్బాల్ టోర్నీలో పక్షం రోజుల అనంతరం హైదరాబాద్ ఎఫ్సీ (హెచ్ఎఫ్సీ) బరిలోకి దిగనుంది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంపై కన్నేసిన హైదరాబాద్ జట్టు సోమవారం ఈస్ట్ బెంగాల్తో తలపడనుంది. ఈ సీజన్లో ఆడిన 11 మ్యాచ్ల్లో ఐదింటిని ‘డ్రా’చేసుకుని రెండింట ఓడిన హెచ్ఎఫ్సీ నాలుగు విజయాలతో (10 పాయింట్లు) ప్రస్తుతం పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతున్నది. నేడు ఈస్ట్ బెంగాల్తో అమీతుమీకి సిద్ధమైంది. తనపై విధించిన నిషేధం తొలగిపోవడంతో ఓగ్బాచే జట్టులోకి తిరిగి రావడం హెచ్ఎఫ్సీకి అదనపు బలం కానుంది.