జైపూర్: దేశవాళీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీని హైదరాబాద్ జట్టు పరాజయంతో ప్రారంభించింది. మంగళవారం జరిగిన తొలి పోరులో తిలక్ వర్మ అర్ధశతకంతో పోరాడినా.. హైదరాబాద్ 59 పరుగుల తేడాతో పంజాబ్ చేతిలో ఓడింది. మొదట పంజాబ్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 174 రన్స్ చేసింది. సన్వీర్ (19 బంతుల్లో 55; 3 ఫోర్లు, 5 సిక్సర్లు), అన్మోల్ప్రీత్ (50) అర్ధశతకాలతో రాణించారు. అనంతరం చేజింగ్లో హైదరాబాద్ 18.4 ఓవర్లలో 115 పరుగులకు ఆలౌటైంది. తిలక్ (50; 6 ఫోర్లు, ఒక సిక్సర్) ఒంటరి పోరాటం వృథా అయింది.