పుదుచ్చేరి: జాతీయ మహిళల సీనియర్ టీ20 టోర్నీలో తెలంగాణకు చుక్కెదురైంది. మంగళవారం ఆంధ్రతో జరిగిన మ్యాచ్లో తెలంగాణ 26 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. తొలుత బ్యాటింగ్కు దిగిన ఆంధ్ర నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసింది.
అనూష(61*) అజేయ అర్ధసెంచరీతో ఆకట్టుకోగా, స్పిన్నర్ త్రిష(2/21) రెండు వికెట్లతో రాణించింది. ఆ తర్వాత లక్ష్యఛేదనకు దిగిన తెలంగాణ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 104 పరుగులకు పరిమితమైంది. త్రిష (56*) అజేయ అర్ధసెంచరీతో కదంతొక్కగా, సహచరుల నుంచి సహకారం కరువైంది. శరణ్య (3/13), ఝాన్సీ లక్ష్మి (2/24) రాణించారు. అటు బ్యాటింగ్తో పాటు బౌలింగ్లో విజృంభించిన త్రిష ఆల్రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకుంది.