హైదరాబాద్: హైదరాబాద్కు చెందిన యేలేటి ప్రీతమ్రెడ్డి..భారత బాస్కెట్బాల్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. టెహ్రాన్(ఇరాన్) వేదికగా ఈ నెల 21 నుంచి 28 వరకు జరిగే ఫిబా అండర్-18 ఏషియన్ బాస్కెట్బాల్ చాంపియన్షిప్ కోసం శుక్రవారం భారత జట్టును ఎంపిక చేశారు. హైదరాబాద్ జిల్లా జట్టు తరఫున తెలంగాణ సబ్జూనియర్ బాస్కెట్బాల్ చాంపియన్షిప్లో సత్తాచాటిన 16 ఏండ్ల ప్రీతమ్ నిలకడగా రాణిస్తున్నాడు. దీనికి తోడు ప్రతిష్ఠాత్మక జూనియర్ ఎన్బీఏకు ఎంపికైన ప్రీతమ్..తాజాగా దేశం తరఫున బరిలోకి దిగే అవకాశాన్ని దక్కించుకున్నాడు.