హైదరాబాద్, ఆట ప్రతినిధి: టీ గోల్ఫ్ ఫౌండేషన్, బౌల్డర్హిల్స్ గోల్ఫ్ క్లబ్ సంయుక్తంగా నిర్వహిస్తున్న హైదరాబాద్ గోల్ఫ్ ఓపెన్ బుధవారం అట్టహాసంగా ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ర్టాల నుంచి దాదాపు 300 మందికి పైగా గోల్ఫర్లు ఈ టోర్నీలో పోటీపడుతున్నారు.
ఇందుకు సంబంధించిన ట్రోఫీని టీ గోల్ఫ్ ఫౌండర్ చైర్మన్ డాక్టర్ ఎన్ఆర్ఎన్ రెడ్డి, మధుసూదన్రావు, పాపిరెడ్డి, ప్రశాంత్రెడ్డి ఆవిష్కరించారు. తెలంగాణ ప్రత్యేకతను చాటిచెప్పెలా చార్మినార్, బుద్ధ విగ్రహం చిత్రాలను ట్రోఫీపై డిజైన్ చేశారు. గురువారం, శుక్రవారం క్వాలిఫయింగ్ రౌండ్లు, శనివారం ఫైనల్ నిర్వహిస్తామని ఎన్ఆర్ఎన్ రెడ్డి పేర్కొన్నారు.