హైదరాబాద్, ఆట ప్రతినిధి: ఫార్ములా-ఈ రేసుకు మరింత ప్రచారం కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వినూత్న కార్యక్రమాలు ఏర్పాటు చేసింది. ఫార్ములా రేసింగ్ను ప్రజల్లోకి ప్రభావవంతంగా తీసుకుపోయేందుకు ఎంపిక చేసిన ప్రదేశాల్లో కార్లను ప్రదర్శనకు ఉంచుతున్నది. ఇందులో భాగంగా ఇప్పటికే ట్యాంక్బండ్, దుర్గం చెరువు ప్రాంతాల్లో ఫార్ములా-ఈ కారును ప్రదర్శించగా, తాజాగా బిట్స్పిలానీ క్యాంపస్ ఇందుకు వేదిక అయ్యింది.
హైదరాబాద్ క్యాంపస్లో ఈ కారును ఆదివారం వరకు అందుబాటులో ఉంచనున్నారు. తొమ్మిదో సీజన్లో భాగంగా వచ్చే ఏడాది ఫిబ్రవరి 11న ఫార్ములా-ఈ రేసుకు హైదరాబాద్ ఆతిథ్యమిస్తున్నది. రేసును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ప్రభుత్వం హుసేన్సాగర్ పరిసరాల్లో 2.7కి.మీల దూరంతో ప్రత్యేక ట్రాక్ను నిర్మించింది. దీనిపై ఇప్పటికే ఇండియన్ రేసింగ్ లీగ్ (ఐఆర్ఎల్) పోటీలు జరిగాయి.