కోల్కతా : డ్యురాండ్ కప్ ఫుట్బాల్ చాంపియన్షిప్లో హైదరాబాద్ ఫుట్బాల్ క్లబ్(హెచ్ఎఫ్సీ) సెమీఫైనల్కు చేరుకున్నది. ఐఎస్ఎల్ చాంపియన్ అయిన హెచ్ఎఫ్సీ సోమవారం జరిగిన క్వార్టర్ఫైనల్లో 3-1 స్కోరుతో రాజస్థాన్ యునైటెడ్ ఫుట్బాల్ క్లబ్పై విజయం సాధించింది.
హైదరాబాద్ జట్టులో బార్తొలొమెవ్(6ని.), ఆకాష్ మిశ్రా(45ని.) సెవెరియో(69ని.) గోల్స్ సాధించగా, రాజస్థాన్ జుట్టులో మార్టిన్ చావెజ్(29ని.) గోల్ చేశాడు. హైదరాబాద్ జట్టు గురువారం జరిగే రెండో సెమీఫైనల్లో బెంగళూరు ఎఫ్సీతో తలపడుతుంది.