మంజేరి: సూపర్కప్లో హైదరాబాద్ ఎఫ్సీ స్ఫూర్తిదాయక ప్రదర్శన కొనసాగుతున్నది. గురువారం హెచ్ఎఫ్సీ, ఈస్ట్ బెంగాల్ మధ్య ఆఖరి వరకు ఆసక్తికరంగా సాగిన పోరు 3-3తో డ్రాగా ముగిసింది. హెచ్ఎఫ్సీ తరఫున జేవియర్ సివేరియో(11ని, 71ని) డబుల్ గోల్స్తో అదరగొట్టగా, రబీహ్(83ని) మరో గోల్ చేశాడు.
మహేశ్(4ని, 44ని), సుహేర్(17ని) ఈస్ట్ బెంగాల్కు గోల్స్ అందించారు. ఈ డ్రాతో గ్రూపు-బిలో హెచ్ఎఫ్సీ నాలుగు పాయింట్లతో టాప్లో కొనసాగుతుండగా, ఒడిశా రెండో స్థానంలో ఉంది.