హైదరాబాద్, ఆట ప్రతినిధి: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్సీఏ)లో ఎన్నికల కోలాహలం నెలకొన్నది. ఎన్నికల తేదీకి గడువు దగ్గర పడుతుండటంతో అందరూ తమదైన అస్త్రశస్ర్తాలతో గోదాలోకి దిగుతున్నారు. పీఎల్ శ్రీనివాస్ అధ్యక్షుడిగా తమ ప్యానెల్ను గురువారం అధికారికంగా ప్రకటించింది.
ఇందులో ఉపాధ్యక్షుడిగా బాబురావు, కార్యదర్శిగా భాస్కర్, సంయుక్త కార్యదర్శిగా రోహిత్ అగర్వాల్, కోశాధికారిగా గెరార్డ్ కార్, కౌన్సిలర్ వాల్టర్ పోటీ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా భేటీలో వారి అజెండాను వివరించారు. హెచ్సీఏలో ఎలాంటి అవినీతికి తావులేకుండా పక్షపాత పాలనకు పెద్దపీట వేస్తామని తెలిపారు.