హైదరాబాద్, ఆట ప్రతినిధి: జైపూర్ వేదికగా జరిగిన విజయ్ హజారే వన్డే టోర్నీలో హైదరాబాద్ జట్టు అదిరిపోయే బోణీ కొట్టింది. గురువారం మణిపూర్తో జరిగిన తమ తొలి మ్యాచ్లో హైదరాబాద్ ఐదు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
తొలుత మణిపూర్ నిర్ణీత 50 ఓవర్లలో 203 పరుగులు చేసింది. బికాశ్సింగ్(41) ఫర్వాలేదనిపించగా, హైదరాబాద్ బౌలర్లు రవితేజ(3/71), తనయ్ త్యాగరాజన్(2/24), రక్షణ్రెడ్డి(2/28) రాణించారు. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన హైదరాబాద్ 29.5 ఓవర్లలో 208/5 స్కోరు చేసింది. రాహుల్సింగ్(70), చందన్ సహానీ(41) ఆకట్టుకున్నారు.