హైదరాబాద్, ఆట ప్రతినిధి: ప్రపంచ బాక్సింగ్ చాంపియన్షిప్లో కాంస్య పతకం సాధించిన తెలంగాణ యువ బాక్సర్ మహమ్మద్ హుసాముద్దీన్ను రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అభినందించారు. సోమవారం హైదరాబాద్లో మంత్రిని హుసాముద్దీన్ మర్యాద పూర్వకంగా కలిశాడు.
ఈ సందర్భంగా ఇందూరు బాక్సర్ను సన్మానించిన మంత్రి.. భవిష్యత్తులో మరిన్ని పతకాలు సాధించి రాష్ర్టానికి, దేశానికి పేరు ప్రఖ్యాతాలు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రం ప్రభుత్వం క్రీడారంగానికి ప్రాధాన్యతనిస్తున్నదని.. ముఖ్యమంత్రి కేసీఆర్ క్రీడాకారులను ప్రోత్సహించడంలో ఎప్పుడూ ముందుంటారని పేర్కొన్నారు.