హిసార్: రెండుసార్లు కామన్వెల్త్ కాంస్య పతక విజేత, తెలంగాణ బాక్సర్ మహమ్మద్ హుసాముద్దీన్ జాతీయ బాక్సింగ్ చాంపియన్షిప్లో సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. సర్వీసెస్ స్పోర్ట్స్ కంట్రోల్ బోర్డుకు ప్రాతినిధ్యం వహిస్తున్న హుసాముద్దీన్ బుధవారం నాటి పోరులో ఉత్తరప్రదేశ్కు చెందిన మనీష్ రాథోడ్ను 5-0 తేడాతో ఓడించాడు. ఆది నుంచే తనదైన దూకుడు ప్రదర్శించిన హుసామ్..ప్రత్యర్థిపై పదునైన పంచ్లతో విరుచుకుపడ్డాడు. పవర్ఫుల్ పంచ్లు విసురుతూ రిఫరీల నుంచి కీలక పాయింట్లు కొల్లగొట్టాడు.
ఓవైపు పంచ్లు కురిపిస్తూ హుక్స్, జాబ్స్తో ప్రత్యర్థిని ఉక్కిరిబిక్కిరి చేయడంలో సఫలమైన హుసామ్ అలవోక విజయాన్ని సొంతం చేసుకున్నాడు. తదుపరి పోరులో అతడు హిమాచల్ప్రదేశ్కు చెందిన ఆశిష్కుమార్తో తలపడుతాడు. కాగా 63.5 కిలోల విభాగంలో ఆరుసార్లు ఆసియన్ క్రీడల పతక విజేత శివ థాపా, మనీష్ కౌషిక్, 60 కిలోల విభాగంలో వీరేందర్ సింగ్, సునీల్ చౌహాన్, 67 కిలోల విభాగంలో రోహిత్ టోకాస్, అవినాశ్ సెమీస్లో ప్రవేశించారు.