షెన్జెన్: చైనా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత ఏస్ షట్లర్ హెచ్.ఎస్. ప్రణయ్, పురుషుల డబుల్స్ జోడి సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి క్వార్టర్ఫైనల్లో ప్రవేశించారు. ప్రపంచ చాంపియన్షిప్ కాంస్య పతక విజేత ప్రణయ్ ప్రిక్వార్టర్స్లో 21-12, 21-18 స్కోరుతో డెన్మార్క్కు చెందిన మాగ్నస్ జొహాన్సెన్పై 40 నిమిషాలలో విజయం నమోదు చేశాడు.
పురుషుల సింగిల్స్ బరిలో నిలిచిన ఏకైక భారత ఆటగాడు ప్రణయ్ తదుపరి రౌండ్లో జపాన్కు చెందిన మూడో సీడ్ కొడై నరవోకతో తలపడతాడు. పురుషుల డబుల్స్లో టాప్ సీడ్ జోడి సాత్విక్-చిరాగ్ 21-15, 21-16తో జపాన్ ద్వయం అకిరా కోగ-తైచి సయాటొలను ఓడించారు. క్వార్టర్స్లో వారు ఇండోనీసియాకు చెందిన లియో రాలి కార్నాండొ-డేనియల్ మార్టిన్ను ఎదుర్కొంటారు.