తైపీ: భారత స్టార్ షట్లర్ హెచ్ఎస్ ప్రణయ్ తైపీ ఓపెన్ క్వార్టర్ ఫైనల్లో పరాజయం పాలయ్యాడు. బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ సూపర్-300 టోర్నీ పురుషుల సింగిల్స్ క్వార్టర్స్లో శుక్రవారం ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్ ప్రణయ్ 19-21, 8-21తో ఐదో సీడ్ లాంగ్ అంగుస్ (హాంకాంగ్) చేతిలో ఓడాడు.
గత నెలలో మలేషియా మాస్టర్స్ టైటిల్ నెగ్గిన ప్రణయ్.. క్వార్టర్స్లో ఆకట్టుకోలేకపోయాడు.