దుబాయ్: ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్లోకి శ్రేయస్ అయ్యర్ మెరుగైన ర్యాంక్తో అడుగుపెట్టాడు. అరంగేట్ర టెస్టు మ్యాచ్తోనే అజేయ శతకం, అర్ధ సెంచరీతో మెరిసిన శ్రేయస్ అయ్యర్ 74వ ర్యాంక్లో నిలిచాడు. ఐసీసీ బుధవారం విడుదల చేసిన ర్యాంకుల్లో భారత స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ ఐదు, కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆరో స్థానాల్లో స్థిరంగా కొనసాగుతున్నారు. ఓపెనర్ శుభ్మన్ గిల్ ఆరు ర్యాంక్లు ఎగబాకి 66వ ర్యాంక్ పొందాడు. రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్ ర్యాంకింగ్స్లో రెండో ర్యాంక్ను నిలుపుకోగా.. జస్ప్రీత్ బుమ్రా మాత్రం ఒక ర్యాంక్ పడిపోయి పదో ర్యాంక్కు చేరుకున్నాడు. ఆల్ రౌండర్ ర్యాంకుల్లో రవీంద్ర జడేజా రెండో స్థానానికి చేరుకోగా.. బౌలింగ్లో 19వ ర్యాంక్తో మెరుగ్గా ఉన్నాడు.