బెంగళూరు: దక్షిణాసియా ఫుట్బాల్ చాంపియన్షిప్(సాఫ్)లో ఆతిథ్య భారత్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. శనివారం కంఠీరవ స్టేడియం వేదికగా హోరాహోరీగా సాగిన పోరులో భారత్ 4-2(పెనాల్టీ షూటౌట్)తేడాతో లెబనాన్ఫై అద్భుత విజయం సాధించింది. భారత్ తరఫున సునీల్ ఛెత్రీ, అన్వర్ అలీ, మహేశ్సింగ్, ఉదాంతసింగ్ పెనాల్టీ గోల్స్ చేశారు.
నిర్ణీత సమయానికి తోడు అదనపు సమయంలోనూ ఇరు జట్లు గోల్స్ ఖాతా తెరువకపోవడంతో మ్యాచ్ పెనాల్టీ షూటౌట్కు దారితీసింది. మంగళవారం జరిగే ఫైనల్లో కువైట్తో భారత్ తలపడుతుంది.