హైదరాబాద్: దేశంలో యువ మహిళా క్రికెటర్లు తమ కలలను సాకారం చేసుకునేందుకు వుమెన్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని ముంబై ఇండియన్స్ యజమాని నీతా అంబానీ అంది. గుజరాత్ జెయింట్స్తో జరిగిన లీగ్ తొలి మ్యాచ్లో ముంబై ఘన విజయం సాధించడం పట్ల నీత హర్షం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ‘దేశంలో మహిళల క్రికెట్కు ఇది మరుపురాని రోజు. డబ్ల్యూపీఎల్లో భాగమైనందుకు చాలా సంతోషంగా ఉంది. డబ్ల్యూపీఎల్ ద్వారా మరింత మంది మహిళలు క్రికెట్ను కెరీర్గా ఎంచుకునే అవకాశముంది. దేశంలోని చాలా మంది యువ మహిళలకు లీగ్కు స్ఫూర్తిగా నిలుస్తుంది’ అని అన్నారు. గుజరాత్తో మ్యాచ్లో అమ్మాయిల ప్రదర్శన అద్భుతమని నీత ప్రశంసించారు. మహిళల క్రికెట్ను ఆదరించేందుకు భారీ సంఖ్యలో ప్రేక్షకులు స్టేడియానికి రావడం ముదావహం అన్నారు.