Hockey World Cup : భారత పురుషుల హాకీ జట్టు వరుసగా రెండో విజయంతో హాకీ వరల్డ్ కప్ టోర్నీని ముగించింది. రూర్కెలాలోని బిర్సాముండా స్టేడియంలో శనివారం జరిగిన మ్యాచ్లో దక్షిణాఫ్రికాతో 5-2తో గెలుపొందింది. వరుస విజయాతో ఇండియా, అర్జెంటీనాతో కలిసి తొమ్మిదో స్థానంలో నిలిచింది. ఆతిథ్య జట్టు 9వ స్థానంలో నిలవడం అనేది హాకీ వరల్డ్ కప్ చరిత్రలో ఇదే మొదటిసారి. సఫారీ జట్టు 11వ స్థానంతో సరిపెట్టుకుంది. ఇండియా ఫార్వర్డ్ ప్లేయర్ అభిషేక్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా ఎంపికయ్యాడు. భారత కెప్టెన్ హర్మన్ప్రీత్ సింగ్, షంషేర్ సింగ్, ఆకాశ్దీప్ సింగ్ , సుఖ్జీత్ సింగ్ గోల్స్ చేశారు.
క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో భారత్కు న్యూజిలాండ్ షాక్ ఇచ్చింది. పెనాల్టీ షూటౌట్లో 5-4తో విజయం సాధించింది. దాంతో, సొంత గడ్డపై కప్పు కొట్టాలనుకున్న టీమిండియా కల చెదిరింది. ఇంతకుముందు జరిగిన ప్లే ఆఫ్ మ్యాచ్లో జపాన్ను 8-0తో భారత్ ఓడించింది.