న్యూఢిల్లీ: దేశ అత్యున్నత క్రీడా పురస్కారం రాజీవ్గాంధీ ఖేల్రత్న కోసం భారత హాకీ జట్టు గోల్ కీపర్ పీఆర్ శ్రీజేశ్, దీపిక కుమారి పేర్లను హాకీ ఇండియా (హెచ్ఐ) శనివారం సిఫారసు చేసింది. పురుషుల జట్టు వైస్ కెప్టెన్ హర్మన్ప్రీత్ సింగ్, మహిళా ప్లేయర్లు వందనా కటారియా, నవ్జోత్ కౌర్ పేర్లను అర్జున అవార్డు కోసం కేంద్ర ప్రభుత్వానికి పంపింది.