హైదరాబాద్, ఆట ప్రతినిధి: యువ బ్యాటర్ కొడిమెల హిమతేజ (57 బంతుల్లో 11 ఫోర్లు,4 సిక్స్లు 103 నాటౌట్) అజేయ శతకానికి తోడు బౌలర్లు రాణించడంతో టీజీ20 లీగ్లో ఖమ్మం ఏసెస్ (10 పాయింట్లతో) ప్లేఆఫ్స్ బెర్తును ఖాయం చేసుకుంది. సోమవారం ఉప్పల్లో జరిగిన తమ ఆఖరి లీగ్ మ్యాచ్లో ఖమ్మం.. 19 పరుగుల తేడాతో మెదక్ ఫాల్కన్స్ను ఓడించింది. తొలుత బ్యాటింగ్కు వచ్చిన ఆ జట్టు హిమతేజ శతకంతో 20 ఓవర్లకు 190/5 స్కోరు చేసింది. లక్ష్య ఛేదనలో మెదక్ నిర్ణీత ఓవర్లలో 171/7 వద్దే ఆగిపోయి ఓటమితో ఈ టోర్నీని ముగించింది. మరో మ్యాచ్లో 5 వికెట్ల తేడాతో నల్లగొండ నైట్స్ను ఓడించిన హైదరాబాద్ వరుసగా ఏడో విజయంతో లీగ్ దశను అగ్రస్థానంతో ముగించింది.