IND vs ENG 4th Test | భారత్ – ఇంగ్లండ్ మధ్య రాంచీలో జరుగుతున్న నాలుగో టెస్టులో భాగంగా తన ప్రతిభ చూపిద్దామనుకున్న సర్ఫరాజ్ ఖాన్కు కెప్టెన్ రోహిత్ శర్మ క్లాస్ పీకాడు. సిల్లీ పాయింట్ వద్ద ఫీల్డింగ్ చేయమని సర్ఫరాజ్కు సూచిస్తే అతడు స్టైల్గా హెల్మెట్ లేకుండా వచ్చి నిలబడటాన్ని చూసిన హిట్మ్యాన్.. అతడికి క్లాస్ పీకాడు. స్లిప్స్లో ఉన్న రోహిత్.. సర్ఫరాజ్ దగ్గరికి వచ్చి ఇలాంటి కథలేమీ వద్దు అన్నట్టుగా సూచించాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
రాంచీ టెస్టులో భాగంగా మూడో రోజు ఆటలో షోయభ్ బాషిర్ బ్యాటింగ్ చేస్తుండగా రోహిత్.. సర్ఫరాజ్ను సిల్లీ పాయింట్ వద్దకు రమ్మని సైగ చేశాడు. కెప్టెన్ చెప్పగానే సర్ఫరాజ్ వెంటనే అక్కడికి వచ్చి ఫీల్డింగ్ చేసేందుకు రెడీ అయ్యాడు. కానీ స్లిప్స్లో ఉన్న రోహిత్.. ‘ఏయ్ భాయ్.. ఇక్కడ హీరో అవుదామనుకుంటున్నావా..?’ అని చెప్పడంతో సర్ఫరాజ్ వెంటనే హెల్మెట్ తీసుకురావాలని చెప్పడంతో కెఎస్ భరత్ తీసుకొచ్చి ఇచ్చాడు. అదే సమయంలో కామెంట్రీ బాక్స్లో ఉన్న దినేశ్ కార్తీక్.. రోహిత్ అన్న హిందీ వ్యాఖ్యలను ఇంగ్లండ్ క్రికెటర్లకు ఇంగ్లీష్లోకి అనువదించాడు.
🔊 Hear this! Rohit does not want Sarfaraz to be a hero?🤔#INDvsENG #IDFCFirstBankTestSeries #BazBowled #JioCinemaSports pic.twitter.com/ZtIsnEZM67
— JioCinema (@JioCinema) February 25, 2024
కాగా, రాజ్కోట్ టెస్టులో ఎంట్రీ ఇచ్చిన సర్ఫరాజ్ డెబ్యూ క్యాప్ అందుకున్న తర్వాత తన తండ్రి, భార్య దగ్గరకు వెళ్లి భావోద్వేగానికి గురైన విషయం తెలిసిందే. ఇది జరిగిన కొద్దిసేపటికే రోహిత్ శర్మ.. సర్ఫరాజ్ తండ్రి నౌషద్ ఖాన్ను కలిశాడు. అప్పుడు నౌషద్.. ‘మా సర్ఫరాజ్ జాగ్రత్తగా చూసుకోండి..’ అని కెప్టెన్ను కోరగా రోహిత్.. ‘హా.. తప్పకుండా..’ అని భరోసానిచ్చాడు. తాజాగా సర్ఫరాజ్ హెల్మెట్ లేకుండా ఫీల్డింగ్ చేయాలని యత్నించగా రోహిత్ వారించడం గమనార్హం. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. నౌషద్కు ఇచ్చిన మాటను హిట్మ్యాన్ నిలబెట్టుకుంటున్నాడని కామెంట్స్ చేస్తున్నారు.
రాంచీ టెస్టు విషయానికొస్తే.. తొలి ఇన్నింగ్స్లో ఇంగ్లండ్ 353 రన్స్ చేయగా భారత్.. 307 పరుగులకే ఆలౌట్ అయింది. 46 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్కు వచ్చిన ఇంగ్లండ్.. 145 పరుగులకే కుప్పకూలింది. దీంతో భారత్ ముందు 192 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. అయితే మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్.. వికెట్లేమీ నష్టపోకుండా 8 ఓవర్లలోనే 40 పరుగులు చేసింది. రోహిత్ శర్మ (24 నాటౌట్), యశస్వీ జైస్వాల్ (16 నాటౌట్)లు క్రీజులో ఉన్నారు.