పనాజీ: గోవా వేదికగా జరుగుతున్న ప్రతిష్ఠాత్మక నేషనల్ గేమ్స్లో తెలంగాణ ప్లేయర్లు సత్తాచాటుతున్నారు. సోమవారం జరిగిన మహిళల రోయింగ్ సీడబ్ల్యూ1ఎక్స్ ఈవెంట్లో హేమలత రజత పతకంతో మెరిసింది. ప్రత్యర్థులకు దీటైన సవాలు విసురుతూ హేమలత అద్భుత ప్రదర్శన కనబరిచింది. జాతీయ స్థాయిలో ఆకట్టుకున్న ఈ యువ ప్లేయర్ స్పోర్ట్స్ స్కూల్లో విద్యనభ్యసిస్తున్నది