Kaneria : మూడో టీ20లో విధ్యంసక ఇన్నింగ్స్తో సెంచరీ సాధించిన భారత ఆటగాడు సూర్యకుమార్ యాదవ్పై మాజీ క్రికెటర్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. పాకిస్థాన్ మాజీ క్రికటెర్ డానిష్ కనేరియా సూర్యను ఆకాశానికెత్తేశాడు. అతను దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ డివిలియర్స్, వెస్టిండీస్ దిగ్గజం క్రిస్గేల్ను మించిపోయాడని అన్నాడు. ‘సూర్య.. ఇప్పుడు యూనివర్సల్ బాస్. 51 బంతుల్లో 112 పరుగుల అతడి ఇన్నింగ్స్ను మరెవరూ రిపీట్ చేయలేరు. డివిలియర్స్, క్రిస్గేల్ కూడా సూర్య ముందు తేలిపోతారు. ఇప్పటికే అతను ఆ ఇద్దరిని అధిగమించాడు’ అని కనేరియా తెలిపాడు.
శ్రీలంకతో రాజ్కోట్లో జరిగిన మూడో టీ20లో సూర్య సుడిగాలి ఇన్నింగ్స్ ఆడాడు. సిరీస్ డిసైడర్ అయిన ఈ మ్యాచ్లో అతను కేవలం 45 బంతుల్లోనే శతకం సాధించాడు. సూర్యకుమార్కు ఇది పొట్టి క్రికెట్లో మూడో సెంచరీ. 51 బంతుల్లో 112 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. దాంతో, టీమిండియా 228 స్కోర్ చేసింది. ఛేజింగ్లో శ్రీలంక 137 పరుగులకే ఆలౌట్ అయింది.