Haris Rauf : టీ20 వరల్డ్ కప్లో భారత్, పాకిస్థాన్ మధ్య జరిగిన మ్యాచ్ను అభిమానులు ఎప్పటికీ మర్చిపోలేరు. ఆ మ్యాచ్లో తన బౌలింగ్లో విరాట్ కోహ్లీ కొట్టిన సిక్సర్ను పాకిస్థాన్ పేసర్ హ్యారిస్ రౌఫ్ గుర్తు తెచ్చుకున్నాడు. పాకిస్థాన్ పాపులర్ షో హస్నా మనా హై లో కోహ్లీ సిక్సర్ కొట్టినప్పుడు మీరు ఎలా ఫీలయ్యారు? అని అతడిని ఒక అభిమాని అడిగాడు. అందుకు హ్యారిస్.. ‘ఆ బంతి స్టాండ్స్లోకి వెళ్లినప్పుడు వ్యక్తిగతంగా చాలా బాధగా అనిపించింది. ఏదో పొరపాటు జరిగిందని అనుకున్నా. అయితే… మళ్లీ కోహ్లీ అలాంటి షాట్ కొట్టలేడు. అలాంటి షాట్లు చాలా అరుదు’ అని చెప్పాడు. అంతేకాదు..క్రికెట్ తెలిసిన వాళ్లకు కోహ్లీ ఎలాంటి ఆటగాడో తెలుసు. ఆ షాట్ కొట్టేటప్పుడు అతని టైమింగ్ పర్ఫెక్ట్గా ఉంది. అందుకే ఆ బంతి సిక్స్గా వెళ్లింది’ అని హ్యారిస్ రౌఫ్ తెలిపాడు.
మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్లో కోహ్లీ 19వ ఓవర్ ఐదో బంతిని హ్యారిస్ తల మీదుగా స్టాండ్స్లోకి పంపించాడు. ఆ తర్వాత బంతిని స్కూప్ షాట్తో సిక్సర్గా మలిచాడు. 160 టార్గెట్ ఛేదనలో అతను 53 బంతుల్లో 82 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. ఈ మ్యాచ్లో టీమిండియా 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అయితే.. సెమీస్లో ఇంగ్లండ్ చేతిలో భారత్ ఘోరంగా ఓడిపోయింది. ఇంగ్లండ్ ఒక వికెట్ నష్టపోకుండా 168 పరుగుల టార్గెట్ను ఛేదించింది.