హైదరాబాద్, ఆట ప్రతినిధి: జాతీయ క్యాడెట్ తైక్వాండో చాంపియన్షిప్లో హర్యానా ఓవరాల్ చాంపియన్గా నిలిచింది. హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో తెలంగాణ తైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు జరిగిన ఈ పోటీల్లో హ్యర్యానా 105 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. అస్సాం (98 పాయింట్లు) రెండో స్థానం దక్కించుకుంది.
పురుషుల విభాగంలో హర్యానా జట్టు 80 పాయింట్లు సాధించి టాప్ ప్లేస్లో నిలువగా.. మహిళల విభాగంలో ఉత్తరాఖండ్ (54 పాయింట్లు) అగ్రస్థానం దక్కించుకుంది. ముగింపు వేడుకల్లో కేవీఐసీ చైర్మన్ శేఖర్ రావు, యోగానంద్ విజేతలకు బహుమతులు అందజేశారు.