WFI Elections : భారత రెజ్లింగ్ సమాఖ్య ఎన్నికల(Wrestling Federation of India Elections)పై హై కోర్టు స్టే విధించింది. ఈ ఎన్నికల్లో తమకు ఓటు హక్కు కల్పించాలని హర్యానా రెజ్లింగ్ అసోసియేషన్(Haryana Wrestling Association) పిటిషన్ దాఖలు చేయడమే అందుకు కారణం. దాన్ని విచారణకు స్వీకరించిన హర్యానా, పంజాబ్ హైకోర్టు ఆగస్టు 12న జరగాల్సిన భారత రెజ్లింగ్ సమాఖ్య ఎన్నికలపై ఈరోజు స్టే విధించింది. దాంతో, కొత్త షెడ్యూల్ ప్రకారం రేపు జరగాల్సిన ఎన్నికలు వాయిదా పడ్డాయి.
తమది గుర్తింపు పొందిన సంస్థ మాత్రమే కాకుండా భారత రెజ్లింగ్ సమాఖ్యకు అనుబంధ సంస్థ కూడా అని హర్యానా రెజ్లింగ్ ఆసోసియేషన్ తరఫు న్యాయవాది రవిందర్ మాలిక్(Ravinder Malik) ఆ పిటిషన్లో పేర్కొన్నారు. అంతేకాదు నిబంధనల ప్రకారం తమ సంస్థ నుంచి ఇద్దరికి ఓటు వేసే అవకాశం కల్పించాలని హై కోర్టుకు విన్నవించారు. దాంతో, కోర్టు ఎన్నికలపై స్టే విధించింది.
బ్రిజ్ భూషణ్
ఆగస్టు 12న మొత్తం 15 పోస్టులకు ఎన్నికలు నిర్వహించేందుకు రెజ్లింగ్ ఫెడరేషన్ నిర్ణయించింది. ఈ ఎలక్షన్లో బ్రిజ్ భూషణ్(Brij Bhushan) వర్గానికి చెందిన నలుగురు పోటీలో ఉండడం గమనార్హం. ఉత్తర ప్రదేశ్ నుంచి సంజయ్ సింగ్ ప్రెసిడెంట్ పోస్టుకు, ఛత్తీస్గఢ్ నుంచి దర్శన్ లాల్ జనరల్ సెక్రటరీ పదవికి పోటీ పడుతున్నాడు. ఉత్తరాఖండ్ నుంచి ఎస్సీ డెస్వాల్ ట్రెజరీ పోస్టుకు దరఖాస్తు చేసుకున్నారు. షెడ్యూల్ ప్రకారం అయితే జూన్లోనే ఎన్నికలు జరగాల్సింది.
కానీ, లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్పై చర్యలు తీసుకోవాలని రెజ్లర్లు ఆందోళనకు దిగారు. ఒలింపిక్ మెడలిస్ట్ వినేశ్ ఫోగట్(Vinesh Phigat) నేతృత్వంలో భజ్రంగ్ పూనియా, సాక్షి మాలిక్ వంటి స్టార్ రెజ్లర్లు నిరసన ప్రదర్శనలు చేపట్టారు. దాంతో దిగొచ్చిన భారత క్రీడా మంత్రిత్వ శాఖ బ్రిజ్ భూషణ్పై చర్యలు చేపట్టింది.