Harsh Bhogle : ఈ ఏడాది టెస్టు క్రికెట్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ఆటగాళ్లలో కొందరిని కామెంటేటర్ హర్ష భోగ్లే ఈ ఏడాది టెస్టు జట్టుకు ఎంపిక చేశాడు. తాను సెలక్ట్ చేసిన 11 మంది పేర్లను అతను ట్విట్టర్ వేదికగా వెల్లడించాడు. అందులో టీమిండియా నుంచి వికెట్ కీపర్ రిషభ్ పంత్ మాత్రమే చోటు దక్కించుకున్నాడు. ఇంగ్లండ్ నుంచి అత్యధికంగా నలుగురు ఆటగాళ్లను హర్ష ఎంపిక చేశాడు. వాళ్లు ఎవరంటే.. జో రూట్, జానీ బెయిర్స్టో, బెన్ స్టోక్స్, జేమ్స్ అండర్సన్. పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజాం, ఆస్ట్రేలియా ఆటగాడు ఉస్మాన్ ఖవాజా, స్పిన్నర్ నాథన్ లియన్, వెస్టిండీస్ ప్లేయర్ క్రెయిగ్ బ్రాత్వైట్, దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్ కగిసో రబాడ, మర్కో జాన్సెస్ ఈ లిస్టులో ఉన్నారు.
బ్రెండన్ మెక్కల్లమ్ ఇంగ్లండ్ ప్రధాన కోచ్గా బాధ్యతలు చేపట్టాక ఆ జట్టు ఆట తీరే మారిపోయింది. బాజ్బాల్ అనే పదం వాడుకలోకి వచ్చింది. ఆ జట్టు టెస్టుల్లోనూ వన్డేల మాదిరి దూకుడుగా ఆడుతోంది. ఆ జట్టు విజయంలో జో రూట్, జానీ బెయిర్స్టో, అండర్సన్ కీలక పాత్ర పోషించారు. ఇండియా నుంచి రిషభ్ పంత్ టెస్టుల్లో మెరుగ్గా ఆడుతున్నాడు. బంగ్లాదేశ్తో రెండో టెస్టులో అతను 93 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు.
Harsha Bhogle picks his best Test Team of the year 2022:
1. Usman Khawaja.
2. Kraigg Braithwaite.
3. Joe Root.
4. Babar Azam.
5. Jonny Bairstow.
6. Ben Stokes.
7. Rishabh Pant (WK).
8. Marco Jansen.
9. Kagiso Rabada.
10. Nathan Lyon.
11. James Anderson.— CricketMAN2 (@ImTanujSingh) December 29, 2022