WPL | బెంగళూరు: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) రెండో సీజన్లో డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్ జోరు కొనసాగుతున్నది. లీగ్ ఆరంభ పోరులో ఢిల్లీపై చివరి బంతికి సిక్సర్తో విజయం సాధించిన హర్మన్ప్రీత్ కౌర్ సారథ్యంలోని ముంబై ఇండియన్స్.. రెండో మ్యాచ్లో 5 వికెట్ల తేడాతో గుజరాత్ జెయింట్స్ను చిత్తుచేసింది. మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్.. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 126 పరుగులు చేసింది.
టాపార్డర్ విఫలం కాగా.. తనూజ కన్వర్ (28), క్యాథరిన్ బ్రైస్ (25), బెత్ మూనీ (24) పర్వాలేదనిపించారు. ముంబై బౌలర్లలో అమెలియా కెర్ 4, షబ్నమ్ ఇస్మాయిల్ మూడు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో ముంబై 18.1 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 129 రన్స్ కొట్టింది. కెప్టెన్ హర్మన్ప్రీత్ (46 నాటౌట్; 5 ఫోర్లు, ఒక సిక్సర్), అమెలియా కెర్ (31) రాణించింది. లీగ్లో భాగంగా సోమవారం యూపీ వారియర్స్తో ఢిల్లీ క్యాపిటల్స్ తలపడనుంది.