హాంగ్జూ: ఆసియా క్రీడ(Asian Games)ల్లో భారత్కు మరో స్వర్ణం దక్కింది. స్క్వాష్ మిక్స్డ్ డబుల్స్ మ్యాచ్లో ఇండియన్ జోడి పాల్ సంధు, దీపికా పల్లికల్ గోల్డ్ మెడల్ గెలుచుకున్నది. హోరాహోరీగా జరిగిన ఫైనల్లో మలేషియా జంట అజ్మన్, సైఫిక్ బిన్ కమల్ను ఓడించారు. బెస్ట్ ఆఫ్ త్రీ గేమ్స్లో.. ఇండియన్ జోడి సూపర్ గేమ్ను ప్రదర్శించింది. తొలి గేమ్లో 11-7 స్కోరుతో ప్రత్యర్థిపై దీపిక జోడి ఆధిపత్యం ప్రదర్శించింది. ఇక రెండవ గేమ్ మాత్రం హోరాహోరీగా సాగింది.
ఓ దశలో ఈజీగానే వెళ్తున్నట్లు కనిపించినా.. మలేషియా జోడీ చివర్లో జోరును పెంచింది. దీంతో రెండవ గేమ్ రసవత్తరంగా సాగింది. 11-10 స్కోరు తేడాతో రెండవ గేమ్ను గెలిచిన దీపిక జంట.. ఆసియా క్రీడల్లో చరిత్ర సృష్టించింది. ఇండియా ఖాతాలోకి మరో బంగార పతకం వెళ్లింది. ఈ సారి క్రీడల్లో ఇప్పటి వరకు ఇండియాకు 20 గోల్డ్ మెడల్స్ దక్కాయి.
🥇𝐈𝐧𝐝𝐢𝐚𝐧 𝐒𝐪𝐮𝐚𝐬𝐡 𝐑𝐞𝐢𝐠𝐧𝐬 𝐒𝐮𝐩𝐫𝐞𝐦𝐞!🌟
Our dynamic mixed doubles team of @DipikaPallikal and @sandhu_harinder clinches GOLD, defeating Malaysia by a score of 2-0 in the final at #AsianGames2022!💥🥳
Join us in celebrating this golden achievement and sending… pic.twitter.com/d1GiaRVh4q
— SAI Media (@Media_SAI) October 5, 2023