చెన్నై: ముంబై ఇండియన్స్ నిర్దేశించిన 151 పరుగుల ఛేదనలో సన్రైజర్స్ హైదరాబాద్ మూడు వికెట్లు కోల్పోయింది. కీలక సమయంలో కెప్టెన్ డేవిడ్ వార్నర్ పెవిలియన్ చేరడంతో రైజర్స్పై ఒత్తిడి పెరిగింది. పొలార్డ్ వేసిన 12వ ఓవర్ మూడో బంతిని విరాట్ సింగ్ పాయింట్ దిశగా షాట్ ఆడాడు. వార్నర్ కోరిక మేరకు సింగిల్ తీసే ప్రయత్నం చేశారు. ఆ సమీపంలో అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న హార్దిక్ పాండ్య వికెట్ కీపర్ ఎండ్వైపు డైరెక్ట్ త్రోతో వార్నర్(36) రనౌటయ్యాడు. ప్రస్తుతం విరాట్ సింగ్(11), విజయ్ శంకర్(5) క్రీజులో ఉన్నారు. రైజర్స్ విజయానికి ఇంకా 36 బంతుల్లో 49 పరుగులు చేయాల్సి ఉంది.