నాగ్పూర్: దేశంలో కరోనా మహమ్మారి మరోసారి విలయతాండవం చేస్తున్నది. చిన్నా పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరిని గడగడలాడిస్తున్నది. వృద్ధుల పరిస్థితి అయితే మరీ దారుణంగా తయారయ్యింది. కరోనా బారినపడి ఆస్పత్రి పాలైన వృద్ధులను కుటుంబసభ్యులు పట్టించుకోకుండా వదిలేస్తున్న ఘటనలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి.
ఈ నేపథ్యంలో కరోనా వచ్చిందంటే చాలు వృద్ధులు వణికిపోతున్నారు. భవిష్యత్తును తలుచుకుని భయంతో బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. తాజాగా మహారాష్ట్రలోని నాగ్పూర్లో అలాంటి ఘటనే చోటుచేసుకున్నది. కరోనా పాజిటివ్ రావడంతో నాగ్పూర్ ప్రభుత్వ ఆస్పత్రిలోని కొవిడ్ వార్డులో చేరిన ఓ 81 ఏండ్ల వృద్ధుడు బాత్రూంలోకి వెళ్లి ఆక్సిజన్ పైప్తో ఉరేసుకున్నాడు. నాగ్పూర్ ఆస్పత్రి వైద్యులు ఈ విషయాన్ని వెల్లడించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
ఉగ్రవాదుల దాడిలో గాయపడ్డ కౌన్సిలర్ మృతి
పున్నమి చంద్రుడే ఆ నౌకను కదిలించాడు.. !
ఫరూక్ అబ్దుల్లాకు కరోనా పాజిటివ్
భారత మహిళా క్రికెటర్ హర్మన్ప్రీత్ కౌర్కు కరోనా పాజిటివ్