హైదరాబాద్: టీమ్ఇండియా టెస్టు ఆటగాడు హనుమ విహారి వచ్చే దేశవా సీజన్లో హైదరాబాద్ తరఫున బరిలోకి దిగనున్నాడు. గతంలో హైదరాబాద్కు ప్రాతినిధ్యం వహించిన విహారి.. 2015-16 సీజన్లో హెచ్సీఏను వీడి ఆంధ్ర జట్టుకు మారిన విషయం తెలిసిందే. ‘రాబోయే సీజన్ నుంచి హైదరాబాద్ తరఫున బరిలోకి దిగుతా’ అని విహారి బుధవారం ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు. హెచ్సీఏ అధ్యక్షుడు మహమ్మద్ అజారుద్దీన్ కృషి వల్లే విహారి హైదరాబాద్ జట్టులోకి తిరిగి వచ్చినట్లు సమాచారం.