హైదరాబాద్, ఆట ప్రతినిధి: గచ్చిబౌలి స్టేడియం వేదికగా జరుగుతున్న ఓయూ ఇంటర్ కాలేజ్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో గురుకుల విద్యార్థి అగసర నందిని హ్యాట్రిక్ స్వర్ణాలతో సత్తాచాటింది. బుధవారం జరిగిన మహిళల 100మీటర్ల హర్డిల్స్ రేసును 14.4 సెకన్లలో ముగించిన నందిని అగ్రస్థానంలో నిలిచి పసిడి పతకం కైవసం చేసుకుంది. దీపిక, పద్మశ్రీ రెండు, మూడు స్థానాలు దక్కించుకున్నారు. జావెలిన్ త్రో విభాగంలో నందిని 32.17 మీటర్ల దూరం విసిరి స్వర్ణం ఖాతాలో వేసుకుంది. అదే జోరు కొనసాగిస్తూ మహిళల ట్రిపుల్ జంప్లో నందిని(11.00మీ)మూడో స్వర్ణం సొంతం చేసుకుంది.