అహ్మదాబాద్: ఐపీఎల్లో తమదైన జోరు కొనసాగించేందుకు సన్రైజర్స్ హైదరాబాద్(ఎస్ఆర్హెచ్) పట్టుదలతో ఉంది. సొంతగడ్డపై ముంబై ఇండియన్స్ను చిత్తుగా ఓడించిన ఎస్ఆర్హెచ్..గుజరాత్ టైటాన్స్తో ఆదివారం తలపడనుంది. ముంబైతో మ్యాచ్లో పరుగుల వరద పారించిన హెడ్, అభిషేక్శర్మ, క్లాసెన్ మరోమారు బ్యాటు ఝులిపిస్తే..హైదరాబాద్కు తిరుగుండదు. మరోవైపు గుజరాత్ తిరిగి పుంజుకోవాలని చూస్తున్నది.