గుజరాత్తో జరుగుతున్న మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు తొలి వికెట్ కోల్పోయింది. కెప్టెన్ కేన్ విలియమ్సన్ (5) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. వెటరన్ పేసర్ మహమ్మద్ షమీ వేసిన మూడో ఓవర్ ఐదో బంతికి విలియమ్సన్ అవుటయ్యాడు. అదే ఓవర్ రెండో బంతికి బౌండరీ బాదిన అతను.. ఐదో బంతిని స్ట్రైట్గా ఆడేందుకు ప్రయత్నించాడు.
అయితే అతని బ్యాట్ను తప్పించుకున్న బంతి వికెట్లను కూల్చింది. దీంతో గుజరాత్ శిబిరం సంబరాల్లో మునిగిపోయింది. కీలకమైన కేన్ విలియమ్సన్ వికెట్ కోల్పోవడంతో సన్రైజర్స్ అభిమానులు కలవర పడుతున్నారు.