సన్రైజర్స్తో జరుగుతున్న మ్యాచ్లో గుజరాత్ టైటన్స్ తొలి వికెట్ కోల్పోయింది. యువ సంచలనం ఉమ్రాన్ మాలిక్ వేసిన 8వ ఓవర్లో సన్రైజర్స్కు తొలి బ్రేక్ దక్కింది. అంతకుముందు వరకు సాహా, గిల్ (22) స్కోరుబోర్డును పరుగులు పెట్టించారు. ముఖ్యంగా సాహా అదరగొట్టాడు.
అయితే ఉమ్రాన్ బంతి అందుకున్న తొలి ఓవర్లోనే గిల్ను పెవిలియన్ చేర్చాడు. ఉమ్రాన్వేసిన బంతిని కవర్స్ వైపు ఆడేందుకు గిల్ ప్రయత్నించాడు. అయితే అతని బ్యాట్ను తప్పించుకున్న బంతి వికెట్లను కూల్చింది. దాంతో 69 పరుగుల వద్ద గుజరాత్ జట్టు తొలి వికెట్ కోల్పోయింది.