గుజరాత్ టైటాన్స్తో జరుగుతున్న ఐపీఎల్ ఫైనల్లో రాజస్థాన్ బ్యాటర్లు చేతులెత్తేశారు. జోస్ బట్లర్ (39) నిదానంగా ఆడాడు. యశస్వి జైస్వాల్ (22) ఫర్వాలేదనిపించాడు. కెప్టెన్ సంజూ శాంసన్ (14), దేవదత్ పడిక్కల్ (2), షిమ్రాన్ హెట్మెయర్ (11), అశ్విన్ (6), రియాన్ పరాగ్ (15), ఓబెడ్ మెకాయ్ (8) ఎవరూ రాణించలేదు. దాంతో ఐపీఎల్ 2022 ఫైనల్లో రాజస్థాన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసింది.
గుజరాత్ బౌలింగ్ దళాన్ని హార్దిక్ పాండ్యా ముందుండి నడిపించాడు. నాలుగు ఓవర్లు బౌలింగ్ చేసిన పాండ్య.. కేవలం 17 పరుగులే ఇచ్చి మూడు కీలక వికెట్లు పడగొట్టాడు. యువ స్పిన్నర్ సాయి కిషోర్ కూడా రెండు వికెట్లతో సత్తా చాటాడు. షమీ, యష్ దయాళ్, రషీద్ ఖాన్ తలో వికెట్ తీసుకున్నారు.