గుజరాత్ టైటాన్స్తో జరుగుతున్న మొదటి క్వాలిఫైయర్ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ ధాటిగా ఆడుతున్నాడు. యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ (3) స్వల్ప స్కోరుకే పెవిలియన్ చేరడంతో క్రీజులోకి వచ్చిన అతను.. ఎడాపెడా బౌండరీలతో విరుచుకుపడ్డాడు.
అతనికి చక్కని సహకారం అందించిన జోస్ బట్లర్ కేవలం యాంకర్ రోల్ పోషిస్తూ.. సాధ్యమైనంతగా శాంసన్కే స్ట్రైకింగ్ ఇచ్చాడు. దీంతో రాజస్థాన్ కెప్టన్ రెచ్చిపోయాడు. అతను ధాటిగా ఆడటంతో పవర్ప్లే ముగిసే సరికి రాజస్థాన్ జట్టు ఒక వికెట్ నష్టానికి 55 పరుగులతో నిలిచింది.