ఐపీఎల్ ఫైనల్లో రాజస్థాన్ జట్టు నిలకడగా ఆడుతోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆ జట్టు.. ఆరంభంలో యశస్వి జైస్వాల్ (22) ధాటిగా ఆడటంతో పవర్ప్లేలో మంచి స్కోరే చేసింది. అయితే జోరు పెంచేలా కనిపించిన అతన్ని యష్ దయాళ్ పెవిలియన్ చేర్చాడు. అవతలి ఎండ్లో బట్లర్ (14 బంతుల్లో 10 నాటౌట్) నిదానంగా ఆడుతూ యాంకర్ పాత్ర పోషించాడు.
జైస్వాల్ అవుటవగానే.. కెప్టెన్ సంజూ శాంసన్ (6 బంతుల్లో 11 నాటౌట్) క్రీజులోకి వచ్చాడు. అతను కూడా కొన్ని మంచి షాట్లు ఆడాడు. దాంతో పవర్ప్లే ముగిసే సరికి రాజస్థాన్ జట్టు ఒక వికెట్ నష్టానికి 44 పరుగుల చేసింది.