గుజరాత్తో జరుగుతున్న ఐపీఎల్ ఫైనల్లో రాజస్థాన్ జట్టుకు మరో ఎదురు దెబ్బ తగిలింది. ఫామ్లో ఉన్న కెప్టెన్ సంజూ శాంసన్ (14) అవుటయ్యాడు. హార్దిక్ పాండ్యా వేసిన 9వ ఓవర్ రెండో బంతికి సంజూ పెవిలియన్ చేరాడు. ఆఫ్ స్టంప్ ఆవల పడిన బంతిని పుల్ చేసేందుకు ప్రయత్నించిన శాంసన్ విఫలమయ్యాడు.
దాంతో గాల్లోకి లేచిన బంతిని సాయి కిషోర్ అద్భుతంగా అందుకున్నాడు. దాంతో 60 పరుగుల వద్ద రాజస్థాన్ జట్టు రెండో వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం దేవదత్ పడిక్కల్, జోస్ బట్లర్ క్రీజులో ఉన్నారు.