ఐపీఎల్ ఫైనల్లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్థాన్ నిర్ణయం సరైందిగా కనిపించడం లేదు. ఆ జట్టు బ్యాటర్లు భారీ షాట్లు ఆడేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఆరంభంలో కాసేపు జైస్వాల్ (22), శాంసన్ (14) కొన్ని మంచి షాట్లు ఆడినట్లే కనిపించినా.. ఆ తర్వాత బంతిని సరిగా అంచనా వేయలేక పెవిలియన్ చేరారు.
శాంసన్ తర్వాత క్రీజులోకి వచ్చిన దేవదత్ పడిక్కల్ (10 బంతుల్లో 2) తీవ్రంగా నిరాశ పరిచాడు. బట్లర్పై ఒత్తిడి పడకుండా మంచి ఇన్నింగ్స్ ఆడాల్సిన అతను.. క్రీజులో కనీసం కుదురుకోలేకపోయాడు. సరిగ్గా ఒక్క పరుగు చేయడానికే 9 బంతులు తీసుకున్న అతను.. తర్వాతి బంతికే అవుటయ్యాడు. రషీద్ ఖాన్ వేసిన బంతిని కట్ చేయడానికి ప్రయత్నించిన అతను.. షార్ట్ థర్డ్ మ్యాన్లో షమీకి చిక్కాడు.
దాంతో రాజస్థాన్ జట్టు ఇబ్బందుల్లో పడింది. ఆ మరుసటి ఓవర్ తొలి బంతికే నిలదొక్కుకున్న జోస్ బట్లర్ (39) కూడా అవుటయ్యాడు. పాండ్యా వేసిన బంతిని ఆడే క్రమంలో బట్లర్ విఫలమయ్యాడు. దాంతో ెడ్జ్ తీసుకున్న బంతిని కీపర్ సాహా అందుకున్నాడు. 79 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన రాజస్థాన్ జట్టు.. తీవ్రమైన కష్టాల్లో పడింది.