గుజరాత్ టైటాన్స్తో జరుగుతున్న మొదటి క్వాలిఫైయర్లో రాజస్థాన్ రాయల్స్కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఫామ్లో ఉన్న యువ ఆటగాడు యశస్వి జైస్వాల్ (3) స్వల్ప స్కోరుకే పెవిలియన్ చేరాడు. యష్ దయాళ్ వేసిన రెండో ఓవర్లో షాట్లు ఆడటానికి తడబడిన అతను.. చివరి బంతిని డ్రైవ్ చేయడానికి ప్రయత్నించాడు.
ఈ క్రమంలో ఎడ్జ్ తీసుకున్న బంతి కీపర్ సాహా చేతుల్లో పడింది. దీంతో రాజస్థాన్ జట్టు 11 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. ఫామ్లో ఉన్న జైస్వాల్ అవుటవడంతో రాజస్థాన్ అభిమానులు టెన్షన్ పడుతున్నారు.