గుజరాత్ టైటాన్స్తో జరుగుతున్న ఐపీఎల్ ఫైనల్లో రాజస్థాన్ జట్టు తొలి వికెట్ కోల్పోయింది. ధాటిగా ఆడేందుకు ప్రయత్నిస్తున్న యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ (22) పెవిలియన్ చేరాడు. యష్ దయాళ్ వేసిన నాలుగో ఓవర్లో భారీ సిక్సర్ బాదిన అతను.. చివరి బంతిని కూడా బౌండరీ తరలించేందుకు ప్రయత్నించాడు.
దయాళ్ వేసిన షార్ట్ బాల్ను డీప్ స్క్వేర్ లెగ్ వైపు గట్టిగా బాదాడు. అయితే అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న సాయి కిషోర్ దాన్ని చక్కగా అందుకోవడంతో.. జైస్వాల్ పెవిలియన్ బాటపట్టాడు. దీంతో రాజస్థాన్ జట్టు 31 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది.