ఐపీఎల్ ఫైనల్లో గుజరాత్ జట్టు మరో వికెట్ కోల్పోయింది. మాథ్యూ వేడ్ (8) కూడా పెవిలియన్ చేరాడు. సాహా (5) అవుటైన కాసేపటికే అతను కూడా వెనుతిరిగాడు. బౌల్ట్ వేసిన ఐదో ఓవర్ మూడో బంతిని ఫ్లిక్ చేయడానికి వేడ్ ప్రయత్నించాడు.
ఈ క్రమంలో షార్ట్ మిడ్ వికెట్లో ఫీల్డింగ్ చేస్తున్న పరాగ్కు సులభమైన క్యాచ్ ఇచ్చాడు. దాంతో గుజరాత్ జట్టు ఐదు ఓవర్లు ముగిసే సరికి ఒక వికెట్ నష్టానికి 24 పరుగులు చేసింది.